Sreedevi Death Anniversary: శ్రీదేవి వర్ధంతి సందర్భంగా,జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్…!

Sreedevi Death Anniversary: సినీ చరిత్రలో అతిలోకసుందరిగా శ్రీదేవి వెలుగొందారు. 2018 ఫిబ్రవరి 24న ఒక పెళ్లి వేడుక కోసం దుబాయ్ వెళ్లి, ప్రమాదవశాత్తు అక్కడ మరణించారు. ఇప్పటికే శ్రీదేవి మనమధ్య లేక నాలుగేళ్లు అవుతోంది అతిలోక సుందరి వర్ధంతి సందర్భంగా మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ తరుణంలోనే శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ కూడా తన తల్లిని గుర్తుతెచ్చుకుంటూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.

జాన్వి తన తల్లితో దిగిన తన చిన్ననాటి ఫోటోని షేర్ చేసి భావోద్వేగమైన సందేశాన్ని జత చేశారు.”నేను ఇప్పటికే నా జీవితంలో మీరు లేకుండా ఎక్కువ సంవత్సరాలు జీవించాను. కానీ మీరు లేని జీవితానికి మరొక సంవత్సరం యాడ్ అవ్వడాన్ని నేను ద్వేషిస్తున్నాను. మేము మిమ్మల్ని గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నాను అమ్మా. ఎందుకంటే అది ఒక్కటే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తాను” అంటూ తన తల్లి ఉనికిని ఎంతగా కోల్పోతుందో చెప్పుకొచ్చింది.

శ్రీదేవి చిన్న కుమార్తె రిషి కపూర్ కూడా తన తల్లి నాలుగో వర్ధంతి సందర్భంగా శ్రీదేవితో దిగిన పాత ఫోటోని పంచుకున్నారు.ఈ విధంగా శ్రీదేవి కూతుర్లు మరోసారి తన తండ్రిని తలచుకొని ఎమోషనల్ పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక జాన్వికపూర్ ఇప్పటికే తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం ఏ బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై బోని కపూర్ విధమైనటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.