ఎన్టీఆర్ కి మరోసారి దెబ్బేసిన ఫ్యాన్స్..!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న మాస్ హీరోస్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఏకంగా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లెవెల్ ఫేమ్ ని తెచ్చుకోగా దీనితో పాటుగా మరో పక్క తన సినిమాలు కొన్ని రీ రిలీజ్ కి వచ్చాయి.

అయితే వీటిలో ఇప్పటివరకు “సింహాద్రి” భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కానీ ఆది, ఆంధ్రావాలా లాంటి సినిమాలు అయితే అసలు ఎపుడు రిలీజ్ అయ్యాయో ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియలేదు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా మరోసారి మరో చిత్రానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారని చెప్పాలి.

ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్టైనర్ అయ్యిన చిత్రం “అదుర్స్” రీ రిలీజ్ ని ఈ నవంబర్ 18కి ఫిక్స్ చేయగా దీనికి బుకింగ్స్ ఓపెన్ చేస్తే రీసెంట్ టైం లో వచ్చిన స్టార్ హీరోస్ రీ రిలీజ్ లు అన్నిటి కన్నా చాలా తక్కువ రెస్పాన్స్ దీనికి వచ్చింది. పోనీ ఇది ప్లాప్ సినిమానా అనుకుంటే మంచి క్రేజ్ ఉంది.

కానీ రీ రిలీజ్ అంటేనే ఫ్యాన్స్ చూసే సినిమాలు అలాంటిది వారే బుక్ చేసుకోకపోవడంతో సినిమాకి బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయని ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీనితో అప్పుడు ఆంధ్రావాలా కి ఇప్పుడు అదుర్స్ కి ఫ్యాన్స్ దెబ్బేసేలా ఉన్నారని చెప్పాలి. మరి 18కి ఏమన్నా మార్పు ఉంటుందేమో చూడాలి.