“లియో” ని మించి సూర్య సినిమాకి మైండ్ బ్లాకింగ్ బిజినెస్?

రీసెంట్ గా సౌత్ ఇండియా సినిమా దగ్గర ఇంకా రిలీజ్ కి ఎంతో దూరంలో ఉన్న భారీ సినిమా “లియో” జరుపుకున్న బిజినెస్ ఓ రేంజ్ లో సంచలనంగా మారింది. ఏకంగా 400 కోట్ల భారీ ఆఫర్ ఈ సినిమాకి ఉన్నట్టుగా పలు రూమర్స్ అయితే గట్టిగా వినిపించగా కోలీవుడ్ వర్గాలు కూడా ఇది నిజమే అన్నట్టు చెప్పారు.

అయితే ఇప్పుడు లియో ని మించి మరో సినిమా కి సెన్సేషనల్ బిజినెస్ జరిగినట్టుగా ఇపుడు పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ సినిమానే సూర్య తన కెరీర్ లో నటిస్తున్న 42వ సినిమా. దీనికి ముందు కూడా సూర్య కి భారీ ప్లాప్ ఉన్నప్పటికీ ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అంచనాలు పీక్ లోకి వెళ్లాయి.

దీనితో ఈ భారీ సినిమా ఇప్పుడు ఏకంగా 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంటున్నట్టుగా కోలీవుడ్ సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో సౌత్ ఇండియా సినిమా దగ్గర ఇంకా టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని లేకుండా ఈ రేంజ్ బిజినెస్ జరిపిన సినిమా ఇదే అంటూ టాక్ నడుస్తుంది.

కాగా ఈ సినిమాని అయితే దర్శకుడు శివ తెరకెక్కిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు అని తెలుస్తోంది.