త్రిష గుర్రమెక్కితే నోట మాట రాదంటున్నారు ..!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష తమిళంలో చేసిన 96 సినిమాతో ఫాం లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో వరసగా సినిమాలు చేస్తోంది. అలాగే ఒక మలయాళ సినిమా కూడా చేతిలో ఉంది. కాగా వీటిలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘పొన్నియన్ సెల్వన్’ కూడా ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిష.

Trisha roped in for Ponniyin Selvan? - DTNext.in

ఈ సినిమాలో విక్రం, అమితాబ్ బచ్చన్, శోభిత ధూళిపాల్ల, ఐశ్వర్య రాయ్, కార్తి, జయం రవి, జయరాం, విక్రం ప్రభు లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇంత పెద్ద భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని మణిరత్నం పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా చోళుల పాలన నేపథ్యంలో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రూపొందుతుంది.

Is Trisha training horse riding for Mani Ratnam's 'Ponniyin Selvan'? |  Tamil Movie News - Times of India

కాగా ఈ సినిమాలో త్రిష ‘రాణి కుందవై’ పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర కి గుర్రం మీద స్వారీ చేసే సన్నివేశాలు ఉంటాయి. దాంతో త్రిష గుర్రపు స్వారీ నేర్చుకోబోతోందని తాజా సమాచారం. ఈ క్రమంలో చెన్నైలోని హార్స్ రైడింగ్ స్కూలులో జాయిన్ అయిందని తెలుస్తోంది. ఇక సినిమాలో త్రిష గుర్రమెక్కి స్వారీ చేసే సీన్స్ హైలెట్ కానున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా 2021 ఆఖరున రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తమిళం తో పాటు .. తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారట.