నిఖిల్ సూపర్ హిట్ సీక్వెల్ పట్టాలెక్కబోతోంది.. మరి అంచనాల సంగతేంటి..?

నిఖిల్ సూపర్ హిట్ సినిమా కార్తికేయ కి సీక్వెల్ సినిమా తెరకెక్కనుందని గతంలో వార్తలు వచ్చాయి. గతంలో అంటే లాక్ డౌన్ కి ముందే. అప్పుడే ఈ సినిమా సీక్వెల్ కార్తికేయ 2 ని మొదలు పెట్టాలని సన్నాహాలు చేశారు. కార్తికేయ 2014లో వచ్చి నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ తిరిగే ఈ కథ ని వెండితెర మీద ఆసక్తికరంగా చూపించాడు యంగ్ డైరెక్టర్ చందు మొండేటి. స్వాతీ హీరోయిన్ గా నటించింది. కాగా కార్తికేయ 2 కి లాక్ డౌన్ కి ముందు ఘనంగా ప్రారంభం అయింది. కరోనా కారణంగా మొదలైన సినిమా మొదలైనట్టే ఆగిపోయింది.

ఆ తర్వాత నిఖిల్ పెళ్ళి జరగడం.. కొంతకాలం సినిమాలని పోస్ట్ పోన్ చేయడం తెలిసందే. ఇక లాక్ డౌన్ తరువాత నిఖిల్ ’18 పేజెస్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుందట. దాంతో ఈ సినిమా తర్వాత కార్తికేయ 2 తో నిఖిల్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే దర్శకుడు చందూ మొండేటి షెడ్యూల్స్ కి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఈ నెల చివరి వారంలోగానీ లేదా మార్చ్ మొదటి వారం నుంచి కార్తికేయ 2 సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని లేటెస్ట్ అప్‌డేట్. అంతేకాదు సమ్మర్ తర్వాత కార్తికేయ 2 ని రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇక యంగ్ హీరో నిఖిల్ కి ఆ మధ్య సక్సస్ లు లేక ఇబ్బంది పడ్డాడు. అయితే కిరాక్ పార్టీ అన్న సినిమాతో హిట్ అందుకున్నాడు. అలాగే అర్జున్ సురవరం సినిమాతో సాలీడ్ హిట్ అందుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. ఈ క్రమంలో 18 పేజెస్ సినిమాతో గనక హిట్ అందుకుంటే హ్యాట్రిక్ హిట్ దక్కినట్టు అవుతుందని ప్లాన్ చేసుకుంటున్నాడు.