స్పై: నిఖిల్ ఆఖరి ఆయుధం

నిఖిల్ సిద్దార్ద్ హీరోగా కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా లెవల్ లో రాబోతోన్న చిత్రం స్పై. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో సిద్ధమైన ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంతో గ్యారీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుభాష్ చంద్రబోస్ మరణం యొక్క రహస్యాలని చేధించే స్పై గా ఈ మూవీలో నిఖిల్ కనిపించబోతున్నాడు.

ఇంటరెస్టింగ్ స్టొరీ లైన్ తో వస్తోన్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. గురువారం ఉదయం 11.34 నిమిషాలకి ట్రైలర్ లో లాంచ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ AAA సత్యం మల్టీప్లెక్స్ థియేటర్ లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ ఉండటం విశేషం. బన్నీ థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత జరగబోయే మొదటి సినిమా ఈవెంట్ ఇదే కావడం విశేషం.

ఇక ఈ చిత్రం జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ నుంచి ప్రమోషన్స్ స్పీడ్ అప్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక సినిమాకి సంబందించిన అన్ని అడ్డంకులు తొలగిపోవడం ప్రస్తుత రిలీజ్ డేట్ కి టీమ్ మొత్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక నిఖిల్ స్పై మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు.

ఒక వేళ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో నిఖిల్ ఖాతాలో మరో హిట్ గా నిలబడితే మాత్రం అతని మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోనుంది. అదే జరిగితే నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ రెమ్యునరేషన్ తో పాటు బడ్జెట్ కూడా పెరిగిపోయే ఛాన్స్ ఉంది. స్పై మూవీ రిలీజ్ అయిన తర్వాత నిఖిల్ ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే స్వయంభు అనే ఫాంటసీ ఫిక్షనల్ మూవీ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు భిన్నమైన నేపథ్యంలో రానున్న సినిమాలు కావడం విశేషం. స్పై సినిమాలో ఐశ్వర్యా మీనన్ నిఖిల్ కి జోడీగా నటిస్తోంది. ఈ మూవీ నిఖిల్ ఏ స్థాయి హిట్ ఇస్తుందనేది ఇప్పుడు వేచి చూడాలి.