నిఖిల్ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కార్తికేయ 2 కి మళ్ళీ బ్రేక్ పడిందా .?

నిఖిల్ .. టాలీవుడ్ లో హ్యాపీడేస్ సినిమాతో పరిచయం అయి ఆ తర్వాత సోలో హీరోగా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా కార్తికేయ. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ నిఖిల్ కెరీర్ లో టాప్ టెన్ సినిమాలలో నిలిచే సినిమా. ఈ సినిమా తర్వాత నిఖిల్ మార్కెట్ పెరిగింది. మంచి సినిమాలలో నటించే అవకాశాలు అందుకున్నాడు. హీరోయిన్ గా నటించిన స్వాతీ కి మంచి బ్రేక్ వచ్చింది. దాంతో కార్తికేయ సినిమాకి సీక్వెల్ ని రూపొందించాలని దర్శకుడు చందు మొండేటి – హీరో నిఖిల్ ప్లాన్ చేసుకున్నారు.

ఈ క్రమంలో సీక్వెల్ కి అద్భుతమైన కథ ని కూడా తయారు చేసుకున్నారు. కార్తికేయ 2 అంటూ సీక్వెల్ సినిమాకి టైటిల్ ని అనౌన్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ – వివేక్ కూచిభోట్ల ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమాకి ప్రారంభోత్సవం కూడా ఎప్పుడో జరిగింది. కాని కరోనా కారణంగా ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. కాగా తాజా సమాచారం ప్రకారం కార్తికేయ 2 సెట్స్ మీదకి రాబోతుందని తెలుస్తోంది. అయితే మళ్ళీ లాక్ డౌన్ గనక విధిస్తే బ్రేక్ పడే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. ప్రస్తుతం 18 పేజెస్ అన్న సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కుమారి 21 ఎఫ్ ఫేం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నిఖిల్ నుంచి ఈ ఏడాది 18 పేజెస్ తో పాటు కార్తికేయ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.