నార్త్ ఇండియాలో బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న నిఖిల్ కార్తికేయ 2?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు నటుడు నిఖిల్ సిద్దార్థ్. తాజాగా నిఖిల్ చందు మొండేటి దర్శకత్వంలో అనుపమ హీరోయిన్గా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇకపోతే ఈ సినిమాని విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుండగా కనీసం తనకు థియేటర్ కూడా దొరక్కుండా చేశారంటూ ఈయన ఆరోపించారు. ఇలా తన సినిమా విడుదలకు ఎన్నో అవాంతరాలు ఏర్పడటంతో ఒకానొక సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి రెండు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో వెళ్తుంది. ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాని నార్త్ లో కేవలం 50 షోలు మాత్రమే విడుదల చేయడంతో మరిన్ని షోలు పెంచాలని సినీ ప్రేమికులు చిత్ర బృందానికి విన్నపించారు. కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్ కి రప్పిస్తుంది. ఈ సినిమా బాగుందని టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమాకు క్యు కడుతున్నారు.

ఇక ఈ సినిమా టికెట్స్ హిందీలో హాట్ కేకుల్లా అమ్ముడు పోవడంతో మరిన్ని షో లు పెంచాలని ప్రేక్షకులు చిత్ర బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు ఈ సినిమాని 50 షో ల నుంచి 150 షోలకు పెంచారు. ఇలా ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా విపరీతమైన క్రేజీ సంపాదించుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి లాభాలను అందుకుంటుందని చెప్పాలి.