తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొత్తజంట..

7 ఏళ్ల నుండి ప్రేమలో ఉన్న నయనతార, విగ్నేష్.. నిన్న కుటుంబ, బంధుమిత్రుల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక చాలా మంది స్టార్ నటీనటులు కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు. ఇక చెన్నైలోని మహాబలిపురంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో ఈ కొత్త జంట ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వీఐపీ దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ జంటను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఇక ప్రస్తుతం వీరి ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ మారగా అందులో వీరిద్దరు సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.