Rana : రామానాయుడు స్టూడియో పై పోస్ట్ పెట్టిన రానా… ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్…!

Rana : రానా, దగ్గుబాటి సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. ఈ సినిమా నక్సలిజం నేపధ్యంలో వస్తోన్న సినిమా. ఇందులో ప్రియమణి కామ్రేడ్ భారతక్క గా జరీనా వాహబ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక రానా సినిమా కావడం సాయి పల్లవి ఉండడంతో సినిమాపై ఆసక్తి కలిగింది. ఇక సినిమా నుండి విడుదలైన టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇక ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోవడం మళ్ళీ సినిమా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక పోవడంతో సినిమాను ప్రేక్షకులు దాదాపు మర్చిపోయారు. ఇక సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని సురేష్ బాబు అనుకుంటున్నారట. ఇక విరాట పర్వానికి మోక్షం ఇపుడు కలుగుతోందో చూడాలి.

ఇక రానా దగ్గుబాటి రామానాయుడు స్టూడియోస్ తొలిరోజుల్లో నిర్మితమవుతున్న సమయంలోని ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.ఇక ఈ పోస్ట్ కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. బాహుబలి కి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మరోక అభిమాని అడగగా, మరొకరు మాత్రం విరాటపర్వం సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో కాస్త చెప్పండన్న అని ప్రశ్నించారు. మరొకరు విరాటపర్వం సినిమా విడుదల డేట్ ని మర్చిపోండి విడుదలైనప్పుడే చూద్దామని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు కాస్త నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే వీటన్నిటి పై రానా స్పందించకపోవడం గమనార్హం.