NBK 109.. దర్శకుడు-నిర్మాత మధ్య పైసల గోల

గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. అన్ స్టాపబుల్ షోచేవబ ఊహించిన విధంగా ఫాన్ ఫాలోవర్స్​ను పెంచుకున్నారాయన. అలానే అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్​ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్​ హిట్లతో ప్రస్తుతం బాలయ్య ఫుల్ జోష్​లో ఉన్నారు. ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.20కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఇటీవల వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఓపెనింగ్స్ ఊహించని రికార్డ్​ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆయన కెరీర్​లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.

అయితే రాబోయే రోజుల్లో బాలకృష్ణ నుంచి మరిన్ని ఆసక్తికరమైన కాంబినేషన్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆయన పవర్ఫుల్ క్యారెక్టర్​లో కనిపించబోతున్నారు. అంతేకాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందించే పాత్ర కూడా చేయబోతున్నారు.

ఇక దీని తర్వాత NBK 109 గురించి గత కొద్ది రోజులుగా తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో పూరీజగన్నాథ్​, క్రిష్​, బోయపాటితో పాటు ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా పేర్లు ఉన్నాయి. అయితే ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే బాలయ్య NBK 109ని ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ నూతన దర్శకుడు ఇటీవలే తన తొలి సినిమా మంచి హిట్​ అందుకున్నారని సమాచారం. ఆ సినిమా రూ.50కోట్ల వరకు ఆర్జించిందట. అయితే ఇప్పుడీ కాంబినేషనల్​లో ఓ చిన్న సమస్య వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు కూడా బాలయ్య రూ.20కోట్ల రెమ్యునరేషన్​ తీసుకుంటున్నారట.

అయితే ఆ దర్శకుడు కూడా తనకు రూ.10కోట్లు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. కానీ ఆ మూవీ నిర్మాత.. కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇస్తానని, నాన్​ థియేట్రికల్​ లాభాల్లో 20 శాతం షేర్​ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే ఆ ఆఫర్​ నచ్చని దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. మరి ఆ దర్శకుడు ఎవరో, నిర్మాత ఎవరో స్పష్టంగా తెలీదు.