NBK 108.. ఇక ప్లాన్ మార్చక తప్పట్లేదు!

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ హీరోయిన్ కాజల్ కాంబినేషన్ లో రాబోతున్న ఎన్బీకే 108 చిత్రం గురించి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. తండ్రి, కుమారుడి రోల్స్ లో కనిపించే మెప్పించేందుకు బాలకృష్ణ సిద్ధం కాగా సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది.

నందమూరి బాలకృష్ణ అన్నయ్య కుమారుడు, ప్రముఖ నటుడు నందమూరి తారక రత్న చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తారకరత్న మృతితో బాబాయ్ బాలయ్య బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలు, తర్వాత జరగాల్సిన కార్యక్రమాల కోసం ఆయన తన 108వ సినిమా షూటింగ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఓ వారం, పదిరోజుల పాటు బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం.

అయితే నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న హీరో తారక రత్న జనవరి 26వ తేదీన కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించగా… 23 రోజుల తర్వాత అంటే నిన్న ఆయన చనిపోయారు. ఆ వార్త విన్న బాలయ్య బాబు కంటతడి పెట్టుకున్నారు. చాలా ఎమోషనల్ అయిపోయారు.

ఫేస్ బుక్ వేదికగా.. ఓ పోస్టు కూడా చేశారు. నన్ను ఎంతో ఆప్యాయంగా బాల బాబాయ్ అనే పిలిచేవాడు.. ఇక ఆ పిలుపు వినిపించదని తెలిసి తల్లిడిల్లిపోయానంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరికీ ముందు నుంచి చాలా మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే తారక రత్న ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు బాలయ్య బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయన ఆసుపత్రి ఖర్చులన్నీ బాలకృష్ణే భరించినట్లు కూడా చాలా వార్తలు వచ్చాయి. కానీ తారకరత్న చనిపోవడంతో… తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.