భర్త విఘ్నేష్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార!?

దక్షిణాదిన అగ్రనటీమణుల్లో వెలుగొందుతున్న నయనతార సామాజిక మాధ్యమాల్లో ఈమధ్యనే ఆరంగేట్రం చేశారు. ఆమె తన కవల పిల్లల ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ లో మొదటి పోస్టుగా పెట్టి జాయిన్‌ అయ్యారు. ఆ తరువాత ఆమెకి వందల, వేల, లక్షల మంది అభిమానులు ఫాలో అవటం మొదలెట్టారు.

ఈరోజు ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌ లో 78 లక్షల మంది ఫాలోవర్స్‌ (7.8 మిలియన్‌) వున్నారు. ఇప్పుడు నయనతార వార్తల్లో వున్నారు. ఎందుకంటే ఆమె తన భర్త విఘ్నేష్‌ శివన్‌ ని ఇన్‌స్టాగ్రామ్‌ లో అన్‌ ఫాలో చేశారు. ఎందుకు అలా చేశారో ఎవరికీ తెలియదు కానీ నయనతార అభిమానులు మాత్రం ఈ విషయంపై రకరకాలుగా చర్చించు కుంటున్నారు. అదేదో పొరపాటున అలా అయింది అని అదేమంత పెద్ద విషయం కాదని ఇలా అనుకుంటున్నారు.

కొందరైతే సాంకేతిక కారణాలు ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఇలా ఎవరికీ వారు అనుకుంటున్నా, నయనతార ఇన్‌స్టాగ్రామ్‌ లో మాత్రం ఆమె తన భర్తని ఫాలో అవుతున్నట్టు మళ్ళీ చూపిస్తోంది. ఏదైనా సాంకేంతిక లోపం వలన కొన్ని గంటలపాటు అన్‌ ఫాలో అయినట్టు కనిపించక పోవచ్చు అని కూడా అంటున్నారు. పని పరంగా చూస్తే నయనతార ఈమధ్యనే షారుఖ్‌ ఖాన్‌ తో నటించిన హిందీ సినిమా ‘జవాన్‌’ చాలా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ‘టెస్ట్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు, ఇందులో మాధవన్‌, సిద్దార్థ్‌, మీరా జాస్మిన్‌ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. శశికాంత్‌ ఈ సినిమాకి దర్శకుడు.