నయన్‌ ఫోటో షూట్‌ మ్యాగజైన్‌ కోసం గ్లామర్‌ ఆరబోత

దక్షిణాదిలోని కథానాయికల్లో అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న నయనతార తాజాగా ఓ మ్యాగ్‌జైన్‌ కోసం గ్లామర్‌ ఫొటో షూట్‌ నిర్వహించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల నయనతార తమిళంలో నటించిన ’ఇరైవన్‌’, బాలీవుడ్‌లో ’జవాన్‌’ చిత్రాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరీ ముఖ్యంగా ’జవాన్‌’ కలెక్షన్లు బాలీవుడ్‌లో పాత రికార్డులను తిరగరాశాయి. ప్రస్తుతం ఆమె ’టెస్ట్‌’ అనే మూవీతో తన 75వ చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలావుండగా నయనతార తన సినీ కెరీర్‌ ఆరంభంలో ’బిల్లా’ వంటి చిత్రాల్లో ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ నటించారు. ఆ తర్వాత ఆమె ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటున్నారు. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ.. తన ఇమేజ్‌ను పెంచుకుంటూ వచ్చారు.

ఎవరైనా హీరో సరసన నటించినప్పటికీ.. హుందా అయిన పాత్రలనే ఆమె చేస్తోంది. కానీ ఇప్పుడు ఆమె మనసు మార్చుకుందనేలా కోలీవుడ్‌ ప్రేక్షకులు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్‌లో స్థిరపడాలనే ఆశ ఉందనే విధంగా కోలీవుడ్‌ విూడియా సైతం వార్తలు రాస్తుండటం విశేషం.

’జవాన్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో బాలీవుడ్‌లో స్థిరపడేందుకు నయనతార ప్రయత్నాలు మొదలెట్టిందని.. అందుకే మళ్లీ ఎక్స్‌పోజింగ్‌ వైపు మొగ్గు చూపుతుందనే కామెంట్స్‌ నయనతారపై వినిపిస్తున్నాయి. ఆమెపై ఇలాంటి వార్తలు రావడానికి కారణం.. తాజాగా బాలీవుడ్‌కి చెందిన ఓ మ్యాగ్‌జైన్‌ కవర్‌ పేజీ కోసం నిర్వహించిన ఫొటోషూటే.

ఈ ఫొటోషూట్‌లో ఆమె గ్లామర్‌ని ఒలకబోసింది. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకర్షించాలనే ఇలా నయనతార ఎక్స్‌పోజింగ్‌కు దిగిందనేలా.. ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లు కూడా కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నయనతారకు చెందిన ఈ ఫొటోలు టాక్‌ ఆఫ్‌ ద సోషల్‌ విూడియాగా మారాయి. మరి నిజంగా ఆమె బాలీవుడ్‌లో స్థిరపడేందుకే ఇలా చేసి ఉంటుందా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.