‘జవాన్‌’లో నయానతారకు అంత ప్రాధాన్యత లేదు!

వెయ్యి కోట్ల మార్క్‌కు అతి చేరువలో ఉంది జవాన్‌ సినిమా. ఇప్పటికే రూ.950 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఈ వీకెండ్‌ పూర్తయ్యేలోపు వెయ్యి కోట్ల మార్క్‌ టచ్‌ చేస్తుంది. అదే జరిగితే ఒకే ఏడాదిలో రెండు సార్లు రూ.1000 కోట్లు కొల్లగొట్టిన హీరోగా షారుఖ్‌ పేరిట సరికొత్త రికార్డును క్రియేట్‌ అవుతుంది. నార్త్‌, సౌత్‌ అని తేడా లేకుండా ప్రతీ చోట జవాన్‌ హవానే కొనసాగుతుంది. సినిమా రిలీజై రెండు వారాలు దాటిన వీకెండ్‌ వస్తే దీని జోరు తగ్గడం లేదు.

ఇక ఈ సినిమాకు కలెక్షన్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో.. కొన్ని రూమర్స్‌ కూడా చుట్టుముడుతున్నాయి. మరీ ముఖ్యంగా నయనతార.. అట్లీపై చాలా కోపంగా ఉందని, జవాన్‌లో దీపికా క్యారెక్టర్‌ను హైలెట్‌ చేశాడని, తన స్క్రీన్‌ టైమ్‌ దీపిక కంటే ఎక్కువగానే ఉన్నా.. మార్కులు మాత్రం దీపికాకే పడ్డాయని ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు తమిళ విూడియాలు రాసుకొచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని నయన్‌ కూడా క్లారిటీ ఇచ్చింది.

అయినా కానీ వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కాగా తాజాగా దీనిపై షారుఖ్‌ కూడా స్పందించాడు. ఈ మధ్య షారుఖ్‌ మాటి మాటికి ట్విట్టర్‌లో సెషన్‌ పేరిట కాసేపు అభిమనులతో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని నయనతార రోల్‌ గురించి ప్రస్తావించాడు. దానికి షారుఖ్‌ స్పందించి.. ఈ సినిమాలో నయనతార పోషించిన సింగిల్‌ మదర్‌ క్యారెక్టర్‌ చాలా అద్భుతంగా ఉందని వెల్లడిరచాడు. అయితే నయనతారకు ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ లేకపోయిందని అయినప్పటికీ ఆమె పాత్ర చాలా గొప్పగా ఉందని చెప్పుకొచ్చాడు.

నిజానికి ఈ సినిమాలో ఇద్దరి క్యారెక్టర్స్‌ దేనికదే స్పెషల్‌. ఓ వైపు దేశ ద్రోహి అంటూ భర్తపై వేసిన నిందను కొడుకు తుడిచేస్తాడంటూ వీరుడి లక్షణాలను భోదించే తల్లిగా దీపికా.. మరోవైపు సింగిల్‌ పేరెంట్‌ క్యారెక్టర్‌లో నయన్‌ ఇద్దరి పాత్రలు వేటికవే సినిమాలో కీలకంగా నిలిచాయి.