ఏందిరా అయ్యా ఏం చేత్తానా?.. ఆకతాయిలకు నవదీప్ కౌంటర్

టాలీవుడ్ నటుడు నవదీప్ సోషల్ మీడియాలో ఎంతా యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. వెండితెరపై, బుల్లితెరపై నవ్వులు పూయించిన నవదీప్.. సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు. తాజగా నవదీప్ కొందరు ఆకతాయిలపై కౌంటర్ వేశాడు. ఈ మధ్యే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు హైద్రాబాద్ అంటే చార్మినార్, గోల్కోండ కోట ఎలా తలమానీకం అయ్యాయో.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కూడా హైద్రాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది.

Navdeep Satires On Durgam Cheruvu Cable Bridge Incident
Navdeep Satires On Durgam Cheruvu Cable Bridge Incident

అయితే అలాంటి కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వంతెనపైకి వెళ్లడానికి అర్ధరాత్రి 11:00 తర్వాత అనుమతి లేదంటూ అధికారులు ఇటీవలూ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆకతాయిలు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఓ ఆకతాయి షర్ట్ లేకుండా రోడ్డుపై పడుకొని ఫొటోలకు పోజులిస్తుండగా అతని స్నేహితుడు ఫోటో తీసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ లోపు కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది గుర్తించి పెట్రోలింగ్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడంతో వారు పరారయ్యారు.

Navdeep Satires On Durgam Cheruvu Cable Bridge Incident
Navdeep Satires On Durgam Cheruvu Cable Bridge Incident

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఈ క్రమంలో ఆకతాయిలను ఉద్దేశిస్తూ కబడ్డీ కబడ్డీ సినిమాలోని కామెడీ డైలాగ్‌ను పోస్ట్ చేశాడు. ఏందిరా అయ్యా ఏం చేత్తానా అంటూ కామెంట్ చేశాడు. నవదీప్ ప్రస్తుతం హిమాలయాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. బైకుపై రోడ్డు ట్రిప్ ద్వారా హిమాలయాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.