టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల హిట్-3తో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, తన మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్యారడైజ్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రియలిస్టిక్ డ్రామాల వేదికపై మరోసారి నాని మ్యాజిక్ చూపిస్తాడా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా, నానికి చాలా కాలం క్రితమే సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా లైన్ లో ఉందన్న విషయం తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్ట్ ఎనౌన్స్ విషయంలో ఎందుకంత ఆలస్యం అవుతోంది అన్నది ఫ్యాన్స్ లోనూ చర్చ. కారణం, సుజీత్ ఓజీతో బిజీగా ఉండటమే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండటంతో మధ్యలో షూటింగ్ నిలిచినా, రీసెంట్ గా ఆయన డేట్స్ ఇచ్చి మరల సెట్స్ పైకి వచ్చారు.
ఓజీ వచ్చే ఆగస్టు-సెప్టెంబర్ లో విడుదల కావడంతో, తర్వాతి దశలో సుజీత్ పూర్తి స్థాయిలో నాని ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడు. దసరా తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. నాని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందన్న సంగతీ చెప్పాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కు బ్లడీ రోమియో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.