అయ్యప్ప మాల ధరించి శబరిమల కొండకు ఇరుముడితో వెళ్లిన హీరో నాని?

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు కొన్ని సెంటిమెంట్లను ఎంతగానో విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలోని ఎంతోమంది భక్తిశ్రద్ధలతో పలు పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అయితేకొందరు సినీ సెలబ్రిటీలు స్వామివారి మాలలను ధరించి పెద్ద ఎత్తున స్వామివారికి మొక్కు చెల్లించుకోవడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని సైతం అయ్యప్ప మాలను ధరించి శబరిమల కొండకు ఇరుముడితో చేరుకున్నారు.

ఈ క్రమంలోనే శబరిమల యాత్రకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు కాలినడకన ఈయన శబరిమల కొండకు చేరుకోవడమే కాకుండా శబరిమలలు బంగారుతో చేసినటువంటి 18 మెట్ల వద్ద తన కుమారుడు అర్జున్ తో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తనకు ఈ శబరిమల యాత్ర ఎంతో అద్భుతంగా నచ్చిందని ఈ యాత్ర కోసం వచ్చే ఏడాది వరకు వేచి చూడాలి అంటూ చూపుకొచ్చారు.

ఇక తన శబరిమల యాత్రకు సంబంధించిన వీడియోని కాలినడకన కొండపైకి వెళ్లిన దృశ్యాలను అలాగే తన కుమారుడితో కలిసి పూజ చేసినటువంటి దృశ్యాలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ స్వామి శరణం అంటూ క్యాప్షన్ జోడించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే నాని సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.