లేటెస్ట్ : “దసరా” నుంచి ఫస్ట్ ఎవర్ ఇండియా క్రేజీ ప్లానింగ్.!

రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా లెవెల్ చిత్రాల్లో మంచి అంచనాలు ఉన్నటువంటి సినిమా “దసరా” కూడా ఒకటి. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. మరి ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా వెర్సటైల్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఇంట్రెస్టింగ్ రా యాక్షన్ చిత్రం “దసరా”.

దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. కాగా ఈ మార్చ్ లో సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగా చిత్ర యూనిట్ అయితే ఓ సెన్సేషనల్ అప్డేట్ అందులోని ఇండియా సినిమా దగ్గర ఫస్ట్ ఎవర్ కొత్త అప్డేట్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకి గాను ఓ ఇంట్రెస్టింగ్ ప్లానింగ్ ని భారీ లెవెల్లో మేకర్స్ చేశారు.

ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ క్రేజీ ప్లాన్ ఇండియా ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి కూడా చేయని విధంగా ప్లాన్ చేశారు. టోటల్ గా 39 ప్రాంతాల్లో అయితే టోటల్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ అలర్ట్స్ కి సంబంధించి మాసివ్ ఇన్స్టాల్ మెంట్స్ ని అరేంజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

మరి ఇది అంతా నాని 39 వ బర్త్ డే కానుకగా అయితే సూపర్బ్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఇది ఓ క్రేజీ ప్లానింగ్ అని చెప్పాలి. కాగా పాన్ ఇండియా లెవెల్లో అయితే సినిమా రీచ్ కి ఇది బాగా వర్క్ అవుతాను చెప్పొచ్చు. మరి ఇది నిజంగా వర్కౌట్ అయ్యి హిట్ అయితే సినిమాకి మంచ్చు సక్సెస్ అందుతుంది అని అనుకోవచ్చు.