నందమూరి బాలకృష్ణ పారితోషికం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల వరుస హిట్లతో ఫాంలో ఉన్న బాలయ్య, తన మార్కెట్ను బలంగా నిలబెట్టుకుంటూ పారితోషికాన్ని భారీగా పెంచారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటివరకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా పేరున్న ఆయన, ఇప్పుడు దూసుకెళ్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘డాకు మహారాజ్’ వంటి మాస్ కథాంశంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య, ఆ చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. గతంలో ‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలకు రూ.15-18 కోట్ల పరిధిలోనే పారితోషికం తీసుకున్నారని టాక్ ఉన్నా, ఇప్పుడు మాత్రం ‘అఖండ 2’ కోసం ఆయన ఏకంగా రూ.35 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో బాలయ్య పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం.
ఇదే కాదు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న మరో చిత్రానికి బాలయ్య రూ.45 కోట్ల డీల్ ఫిక్స్ చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇది నిజమే అయితే, ఆయన ఇప్పటి వరకు తీసుకున్న రెమ్యూనరేషన్కి ఇది డబుల్గా ఉంటూ, టాలీవుడ్లో కొత్త ట్రెండ్కు నాంది పలుకుతుందనే చెప్పాలి. పైగా, ఈ రెండు ప్రాజెక్టులు కూడా మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని రూపొందుతున్న నేపథ్యంలో, నిర్మాతలు కూడా ఈ ఖర్చుని లాభదాయకంగా మలుచుకునే విధంగా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.