వైరల్ : కృష్ణ అకాల మరణంతో బాలయ్య నుంచి ఎమోషనల్ పోస్ట్.!

పద్మ భూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకస్మిక మరణ వార్తతో టాలీవుడ్ లో లో ఈరోజు తెల్లవారుతుందని ఎవరూ అనుకోని ఉండరు. నిన్ననే కృష్ణ గారు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని వచ్చిన వార్తలు వైరల్ గా మారగా కానీ ఈ తక్కువ గ్యాప్ లోనే వారు లేరు అనే మాట చాలా బాధాకరంగా మారింది.

ఇక ఇదిలా ఉండగా తన మరణ వార్తతో అయితే ఈరోజు మొదలైంది. మరి ఇదిలా ఉండగా కృష్ణ మరణం పట్ల స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని అయితే పెట్టడం వైరల్ గా మారింది.

“తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార చేరింది… నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ.. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి.

వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ.. ఆయనలేని లోటు తీర్చలేనిది.. సూపర్ స్టార్ కృష్ణగారి మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. టాలీవుడ్ జేమ్స్ బాండ్, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ గారి మృతి సినీ రంగానికి తీరని లోటు.

ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేశ్‍బాబుకు ఇది తీరని వేదన – ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. కృష్ణగారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.” అని బాలయ్య అయితే తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేశారు. దీనితో ఇరువురి అభిమానులు కూడా ఎంతో చింతిస్తూ కృష్ణ గారి ఆత్మకి శాంతి చేరాలని కోరుకుంటున్నారు.