మహేష్ బాబు సోదరి మంజులతో తనకున్న రిలేషన్ వెల్లడించిన నమ్రత!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1993లో మిస్ ఇండియ గా టైటిల్ దక్కించుకున్న నమ్రత ‘ జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత 20కి పైగా హాలీవుడ్ సినిమాలలో నటించింది. ఇక టాలీవుడ్ లో నమ్రత నటించిన మొదటి చిత్రం వంశీ. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా నటించిన నమ్రత సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ముంబై లో ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి సితార, గౌతం అనే ఇద్దరు పిల్లలు .

మహేష్ బాబుతో వివాహం జరిగిన తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న నమ్రత ఒక మంచి భార్యగా ఇంటి బాధ్యతలో నిర్వహిస్తూనే మహేష్ బాబు కి సంబంధించిన అన్ని పనులను తానే స్వయంగా చూసుకుంటుంది. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత మహేష్ బాబు సోదరి మంజుల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. అనుకోకుండా హైదరాబాదులో జరిగిన ఒక పార్టీలో మంజులతో పరిచయం ఏర్పడిందని నమ్రత వెల్లడించింది. ఆ సమయంలో నేను మహేష్ బాబును ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. మంజుల నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం ఒక ఫ్యామిలీ లా కలిసిపోయాం అంటూ వెల్లడించింది.

ఇక ఈ క్రమంలో ఇద్దరు ఒకేసారి ప్లాన్ చేసుకొని మరీ ప్రెగ్నెంట్ అయ్యారా అని యాంకర్ అడగ్గా.. అలాచితంగా జరిగిపోయింది అంటూ నమ్రత సమాధానం చెప్పింది. అసలు మనుషులకి మొదట పిల్లలు కనటం అస్సలు ఇష్టం లేదని వెల్లడించింది.కానీ ఇప్పుడు తన కూతురికి తల్లిగా ఎంతో అందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ క్రమంలో పెళ్ళి తర్వత సినిమాలకు దూరమవడం మీకు బాధగా లేదా? అని యాంకర్ అడగ్గా.. అసలు బాధ లేదు. నేను నా పిల్లలలో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అంటు వెల్లడించింది.