క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి మ‌హిళా న‌టి.. గుడ్ గార్ల్ అంటూ కామెంట్ చేసిన మ‌హేష్ వైఫ్‌

2020 సంవ‌త్స‌రం మొత్తం క‌రోనాతో ప్ర‌పంచ దేశాలు ఎంత‌గా విల‌విల‌లాడోయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌రోనా పేరు చెబిత‌నే వణికిపోయే ప‌రిస్థితి వచ్చింది. సామాన్యులే కాక సెల‌బ్రిటీలు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఇందులో కొంద‌రు కోలుకోగా, మ‌రి కొంద‌రు మృత్యువాత ప‌డ్డారు. అయితే క‌రోనా వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు కొన్ని నెల‌లుగా క‌సర‌త్తులు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ డ్రైవ్ వివిధ ద‌శ‌ల‌లో ఉండ‌గా, దుబాయ్‌లో ఇప్ప‌టికే వ్యాక్సిన్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

రీసెంట్‌గా న‌మ్ర‌త శిరోద్క‌ర్ సోద‌రి శిల్ప శిరోద్క‌ర్ క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోగా, ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోవ‌డం చాలా సుర‌క్షితం. దాని వ‌ల‌న మ‌నం అంద‌రం మ‌ర‌లా సాధార‌ణ జీవితం గ‌డ‌పొచ్చు. నాకు టీకా ఇచ్చిన యూఏఈ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అంటూ శిల్పా త‌న చేతికి వేసిన టీకాని చూపిస్తూ పోస్ట్ పెట్టారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న తొలి న‌టి ఈమెనే కాగా, ఆమె తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల న‌మ‌త్ర సంతోషం వ్య‌క్తం చేసింది.

శిల్ప శిరోద్క‌ర్ పోస్ట్‌కు గుడ్ గార్ల్ అనే కామెంట్ పెట్టింది న‌మ్ర‌త శిరోద్క‌ర్. అయితే శిల్ప కూడా 90ల కాలంలో మంచి న‌టి అన్న విష‌యం కొంద‌రికే తెలుసు. పెళ్ళి త‌ర్వాత పూర్తిగా సినిమాలు మానేసి దుబాయ్ వెళ్లిన శిల్ప అక్క‌డే సెటిల్ అయింది. రీసెంట్‌గా మ‌హేష్ ఫ్యామిలీ దుబాయ్ టూర్‌కి వెళ్లి అక్క‌డ స్టే చేసింది శిల్ప వాళ్ల ఇంట్లోనే. క‌రోనా వ‌ల‌న ఎనిమిది నెల‌ల పాటు ఎటు వెళ్ల‌లేక‌పోయిన మ‌హేష్ ఫ్యామిలీ దీపావ‌ళి స‌మ‌యంలో దుబాయ్‌కు వెళ్లి అక్క‌డ ఫుల్ ఎంజాయ్ చేసి వ‌చ్చారు.