Nagarjuna and chiranjeevi : సాంస్కృతిక మహోత్సవానికి రానున్న నాగార్జున, చిరంజీవి!

Nagarjuna and chiranjeevi : ఉగాది సందర్భంగా ప్రస్తుతం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ మహోత్సవం కు పలువురు నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇక ఈరోజు కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్రాఫ్ట్స్ మేళాను ప్రారంభించారు.

ఇక కిషన్ రెడ్డి కొన్ని విషయాలను పంచుకున్నాడు. ఈరోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రారంభిస్తారని తెలిపాడు. అంతే కాకుండా సినీ నటుడు నాగార్జున కూడా పాల్గొంటాడని అన్నాడు. ఇక రేపు జరిగే కార్యక్రమంలో చిరంజీవి రానున్నట్లు తెలిపాడు. ఇక తెలంగాణ గవర్నర్ మాట్లాడుతూ.. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వారు స్టాల్స్ ఏర్పాటు చేశారని చాలా బాగున్నాయని అన్నాడు.