‘ఛలో’ కాంబో మళ్లీ రిపీట్ కానుందా.?

యంగ్ హీరో నాగ శౌర్యకు ఇటీవల పెద్దగా కలిసి రావడం లేదు. మంచి కథలే అనుకుని ఎంచుకుంటున్నా దారుణంగా దెబ్బ కొట్టేస్తున్నాయ్. మొన్నా మధ్య ‘లక్ష్య’, ‘అశ్వద్ధామ’ అంటూ ఏవేవో ప్రయోగాలు చేశాడు. అవి కాస్తా బెడిసికొట్టాయ్.

తర్వాత తేరుకున్నాడు. రీసెంట్‌గా ‘రంగబలి’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడనుకున్నారంతా. అయితే, ప్రమోషన్ చిత్రాలతో ఇచ్చిన కిక్కు రిలీజ్ తర్వాత ఇవ్వలేకపోయాడు. ఏజ్ యూజ్‌వల్ ఓ మోస్తరు ఎంటర్‌టైనర్‌ లిస్టులో పడేశారు ‘రంగబలి’ని.

ఇక, ఇప్పుడు ఇంకో ప్రయోగానికి తెర లేపబోతున్నాడట నాగ శౌర్య. ఈ సారి మల్టీ స్టారర్ సినిమాతో రాబోతున్నాడనీ తెలుస్తోంది. సొంత బ్యానర్‌లోనే ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గాసిప్ ఏంటంటే, ఈ సినిమా కోసం రష్మిక మండన్నాని హీరోయిన్‌గా తీసుకురావాలనుకుంటున్నాడట నాగ శౌర్య.

రష్మిక మొదటి చిత్రం ‘ఛలో’లో నాగ శౌర్య హీరో అన్న సంగతి తెలిసిందే. కలిసొచ్చిన హీరో రష్మికకు నాగ శౌర్య. అయితే, ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోయింది. మహేష్, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోల సరసన నటించింది. ఆ తరహా ప్రాజెక్టులే టేకప్ చేస్తోంది. మరి, ఈ టైమ్‌లో నాగ శౌర్యను రష్మిక కన్సిడర్ చేస్తుందా.? చూడాలి మరి.