నాగ శౌర్యకి మండింది.! కారణం వేరే వుంది.!

హీరో నాగ శౌర్యకి ఒళ్ళు మండిపోయింది. సక్సెస్ మీట్ పెట్టి, పాత్రికేయులతో మాటామంతీ క్రమంలో ఒకింత అసహనానికి గురయ్యాడు నాగశౌర్య. షార్ట్ టెంపర్ విషయమై నాగ శౌర్య మీద గతంలోనూ రకరకాల గాసిప్స్ వచ్చాయ్.

‘రంగబలి’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా కొంచెం కూల్‌గా, ఇంకొంచెం యాటిట్యూడ్‌తో నాగశౌర్య కనిపించిన సంగతి తెలిసిందే. ఒకింత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ప్రదర్శించాడు.

ప్చ్.. సినిమా తేడా కొట్టేసింది. ఈ క్రమంలో సక్సెస్ మీట్‌లో అసహనంతో ఊగిపోయాడు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకూ ఒళ్ళు మండిపోయిందతనికి. అకస్మాత్తుగా ప్రెస్‌మీట్‌ని ముగించేశాడు.

ముందస్తుగా మీడియాని మేనేజ్ చేసి, ‘సినిమా హిట్టే’ అనిపించేసినా, రివ్యూల్లో మాత్రం అసలు విషయం బయటపడిపోయింది. ఇలా ఎలా రాస్తారు.? అంటూ, పీఆర్ టీమ్‌ని పిలిచి మండిపడ్డాడట నాగ శౌర్య. అక్కడితో ఆగక, ప్రెస్ మీట్‌లో పాత్రికేయులపై పైత్యం ప్రదర్శించాడన్నమాట. ప్చ్.. పీఆర్ కోసం వ్యక్తిగతంగానూ గట్టిగా ఖర్చు చేసి, ఇదిగో.. ఇలా అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చిందన్నమాట. అదీ అసలు సంగతి.