నాగ చైతన్య చాలా ఇష్టంగా తీసుకున్న ఈ నిర్ణయం.. సమంత ఏమంటుందో మరి..?

నాగచైతన్య నటిస్తున్న సినిమాలు హిట్ అవుతూ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఈ క్రమంలో నాగ చైతన్య ఒక్కో సినిమాని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. అయితే సినిమా సినిమాకి గ్యాప్ మాత్రం బాగా తీసుకుంటున్నాడు. ఈ ఒక్క విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు తప్ప మిగతా విషయాలలో ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. కాగా రెండేళ్ల కిందట మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.

పెళ్ళి తర్వాత చైతూ – సమంత కలిసి నటించిన మజిలీ ఇద్దరి కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయో సినిమాగా మిగిలిపోతుందనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక మజిలీ విడుదలైన రెండేళ్లకు ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ అవుతోంది. కాగా ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా గురించి అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ లో చైతూ కి జంటగా నేచురల్ బ్యూటి సాయిపల్లవి నటించింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కాబోతుంది.

ఇక నాగ చైతన్య ప్రస్తుతం మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.అయితే ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ అందరూ సిల్వర్ స్క్రీన్ నుండి డిజిటల్ స్క్రీన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో చైతూ ఎప్పుడు డిజిటల్ లోకి ఎంట్రీ ఇస్తాడని మాట్లాడుకుంటున్నారు. దాంతో ఈ విషయంలో చైతూ క్లారిటీ ఇచ్చాడు. నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్న ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘పిట్టకథలు’. ఈ టీమ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో చైతూ ఫ్యూచర్ లో తన ప్లాన్స్ గురించి తెలిపాడు. సినిమాల్లో కంటే డిజిటల్ ప్రపంచంలో క్రియేటివిటీ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుందని తనకు కూడా ఓటిటి వైపు అడుగువేయాలని ఉన్నట్లు చెప్పాడు. ఇప్పటికే సమంత ది ఫ్యామిలీ మాన్ 2 లో నటించింది. మరి చైతూ విషయంలో ఏమంటుందో చూడాలి.