‘నా సామిరంగా’ అంటూ సంక్రాంతికి వస్తోన్న నాగ్ !

సంక్రాంతికి’నా సామిరంగా’ చిత్రంతో సందడి చేయబోతున్నారు నాగార్జున. విజయ్‌ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఆదివారం ‘నా సామిరంగ’ నుంచి ’ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే… రమణి ముద్దుల గుమ్మ నందనా’ అంటూ సాగే తొలి గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. చంద్రబోస్‌ సాహిత్యానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. రామ్‌ మిరియాల ఆలపించారు. ప్రసన్నకుమార్‌ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు.