మైత్రీ కష్టాలు.! ఏం పాట్లు సామీ ఇవి.?

మైత్రీ మూవీ మేకర్స్ రెండు ప్రతిష్టాత్మక సినిమాల్ని ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ బంపర్ హిట్. ‘వీర సింహా రెడ్డి’ కూడా కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అయ్యింది. రెండు సినిమాల్నీ చాలా బాగా ప్రమోట్ చేశారు.

అయితే, ‘వీర సింహా రెడ్డి’ని వివిధ కారణాలతో ఇంకాస్త ఎక్కువ ప్రమోట్ చేశారు. కానీ, ‘వాల్తేరు వీరయ్య’ ఎక్కువ లాభాల్ని తెస్తోంది. అయినాగానీ, ‘వీర సింహా రెడ్డి’ మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. ఇదొక వింత పరిస్థితి.

మైత్రీ కష్టాన్ని చిరంజీవి అర్థం చేసుకోగలరు. కానీ, ‘వీర సింహా రెడ్డి’ విషయంలో అలా కుదరదు. బాలయ్యతో తేడా వస్తే.. దబిడి దిబిడే.! కాగా, ‘వాల్తేరు వీరయ్య’కి 200 కోట్ల గ్రాస్.. అంటూ పోస్టరేశారు. మరి, బాలయ్యకి ఏదీ.? బాలయ్య అభిమానులే కాదు, బాలయ్య కూడా గుస్సా అవుతున్నాడట ఈ విషయంలో. మైత్రీ సంస్థకి పెద్ద కష్టమే వచ్చింది. బాలయ్య కోసం నెంబర్ వేసేస్తే.. ఇంకేమన్నా వుందా.?