వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ముహూర్తం ఫిక్స్..ఎంతమంది అతిధులు అంటే 

టాలీవుడ్ లో గత కొన్నాళ్ల కితం నుంచి కూడా యంగ్ హీరో వరుణ్ తేజ్ మరియు మరో యంగ్ నటి లావణ్య త్రిపాఠీ ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారని పలు వార్తలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి వాటిపై వారిద్దరు మొదట్లో పెద్దగా స్పందించలేదు కానీ ఫైనల్ గా రిలేషన్ లో ఉన్నట్టుగా కన్ఫామ్ చేసి ఇద్దరు తమ పెద్దలని ఒప్పించి అయితే ఎట్టకేలకి పెళ్ళికి ఒప్పించుకున్నారు.

అయితే  రోజులు కితమే వీరి పెళ్లి పనులు కూడా స్టార్ట్ కాగా మెగా ఫామిలీ నుంచి ఒకోకరు ఇటలీ ప్రయాణం స్టార్ట్ చేశారు. దీనితో పెళ్లి అంతా ఇటలీ లోనే జరుగుతుంది అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక అక్కడ అయితే చాలా సింపుల్ మ్యానర్ లో ఈ పెళ్లిని మెగా కుటుంబం చేస్తున్నారట.

చాలా లిమిటెడ్ అతిదులతోనే దాదాపు 120 మంది మాత్రమే ఈ యువ జంటని ఆశీర్వదించడానికి వస్తున్నారట. దీనితో ఈ పెళ్లి విషయంలో మెగా కుటుంబం ఎంత లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారో  చేసుకోవచ్చు. ఇక వీరి పెళ్ళి ఈ నవంబర్ 1న ఫిక్స్ చేయగా నవంబర్ 1 మధ్యాహ్నం 2:48 నిమిషాలకి ఈ ముహుర్తాన్ని ఖరారు చేసారని వర్గాల వారు చెప్తున్నారు.

అలాగే రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి అయితే రిసెప్షన్ ఫంక్షన్ జరగనుందని ఖరారు అయ్యింది. మొత్తానికి అయితే ఈ యంగ్ జంట పెళ్లి చాలా సింపుల్ అండ్ నీట్ గా కానిచ్చేస్తున్నారని చెప్పాలి.