ఈ బ్యూటీ లక్కు బాగుంది.. క్లిక్కయితే ఆ రేంజ్ పక్కా…

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన గాండీవదారి అర్జున మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో వైపు తెలుగు, హిందీ భాషలలో ఒక చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మాగ్జిమమ్ కంప్లీట్ అయ్యింది. దీంతో నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ తాజాగా తెరపైకి వచ్చింది.

కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటుగా విశ్వక్ సేన్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తోంది.

ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షి చౌదరి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడీగా కూడా నటించే అవకాశం సొంతం చేసుకోవడం విశేషం. 1960 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

వరుణ్ తేజ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. విశాఖ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉండబోతోందని తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని కరుణ కుమార్ ఆవిష్కరించబోతున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ అప్డేట్ రాబోతోంది.

మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత రవితేజకి జోడీగా ధమాకా మూవీలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అడవి శేష్ కి జోడీగా హిట్ 2తో సూపర్ హిట్ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీకి అవకాశాలు పెరిగాయని చెప్పాలి.

అలాగే మహేష్ బాబు గుంటూరు కారంలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే మాత్రం మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.