సమంతకు ఫోన్ చేసి పరామర్శించిన మెగాస్టార్… సంతోషంలో సామ్?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అని సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇలా ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఎంతోమంది తాను తిరిగి క్షేమంగా కోలుకోవాలని వెంటనే మామూలు మనిషి కావాలి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ తన ఆరోగ్యం పై స్పందించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన అనారోగ్య సమస్య గురించి స్పందిస్తూ తన త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశారు.

ఇకపోతే చిరంజీవి ఇలా సోషల్ మీడియా వేదికగా స్పందించడమే కాకుండా సమంత నటించిన యశోద సినిమా విడుదలై మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఏకంగా సమంతకు ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు అడిగారని తెలుస్తుంది. ఇలా సమంత ఆరోగ్యం గురించి మాట్లాడటమే కాకుండా ఆమె నటించిన యశోద సినిమా గురించి కూడా చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడారట. ఇలా సమంతకు ఫోన్ చేసి మాట్లాడటంతో సమంత ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే సమంతా అనారోగ్య సమస్య గురించి తెలుసుకున్నటువంటి ఎంతో మంది సినీ సెలబ్రిటీలో ఆమె తిరిగి కోలుకోవాలని భావించారు. సినిమా విడుదలైన తర్వాత ఫోన్ చేసిన మెగాస్టార్ సినిమాలో తన నటన ఎంతో అద్భుతంగా ఉందని సినిమా పట్ల ప్రశంసలు కూడా కురిపించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా కమర్షియల్ గా ఏ విధమైనటువంటి హిట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.