మరో సినిమాతో బిజీగా మారనున్న మెగాస్టార్.. డేట్ ఫిక్స్!

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అపజయం లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. సిద్దా అనే ఆ పాత్రకు సంబంధించిన ఒక లుక్ ను కూడా ఇటీవల చూపించి చూపించనున్నట్లుగా ఒక సైడ్ పోటో వదిలారు.

కోవిడ్ నుంచి కొలుకున్న తరువాత రామ్ చరణ్ మొత్తానికి ఆచార్య తో బిజీ అయ్యాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విడుదల కాకముందే మరొక ప్రాజెక్టును పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యారు. మలయాళం హిట్ మూవీ లూసిఫర్ కు సంబంధించిన లాంచ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 21వ తేదీన సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

తమిళ దర్శకుడు తని ఒరువన్ ఫేమ్ మోహన్ రాజా రీమేక్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెగాస్టార్ టార్గెట్ సెట్ చేసుకున్నారు. ఇక ఆచార్య సినిమాను ఏప్రిల్ ఏండింగ్ లో లేదా మే నెలలో విడుదల చేయనున్నట్లు టాక్. ఇక లూసిఫర్ రీమేక్ అనంతరం మెగాస్టార్ తమిళ్ వేదళం రీమేక్ ను సెట్స్ పైకి తేనున్నారు.