మరో సినిమాపై మెగాస్టార్ చిరంజీవి దృష్టి

కథానాయకుడు చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’తో సెట్స్‌పై గడుపుతున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే దీని తర్వాత చిరు చేయనున్న ప్రాజెక్ట్‌ ఏదన్నది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.

అయితే ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మోహన్‌రాజా దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. దీనికి బి.వి.ఎస్‌ రవి కథ అందిస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని.. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారని వార్తలొస్తున్నాయి. నిర్మాతగా చిరు తనయ సుస్మిత కొణిదెల వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశముంది.