సరోగసి ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతున్న మెగా కోడలు…ఇందులో నిజమెంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ నట వారసునిగా ఆయన తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అద్భుతమైన నటనా ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంలో తన వంతు కృషి చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. రామ్ చరణ్ చిరుత, మగధీర, ధ్రువ, రంగస్థలం సినిమాల్లో ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవలే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ అర్ అర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు. కెరియర్ పరంగా రామ్ చరణ్ దుసుకుపోతున్నప్పటికీ తన పర్సనల్ కెరియర్ లో కాస్త వెనుక పడ్డాడని చెప్పొచ్చు.
రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని పది సంవత్సరాలు గడుస్తున్నా కూడా వీరికి పిల్లలు లేరు అనే లోటు మెగా అభిమానుల్లో కాస్త నిరాశ కలిగించే విషయం అని చెప్పొచ్చు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి మా ఇంటికి ఒక బుల్లి వారసుడు రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా వేదిక గా అఫిషియల్ గా ప్రకటించడంతో మెగా ఫ్యామిలీలోనూ ఇటు మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబోతుంది అంటూ ప్రచారం చేయడంతో ఇండస్ట్రీ వర్గాలు చర్చకు దారితీస్తోంది. కొంతమంది ఈ విషయం కేవలం కల్పిత రాతలంటూ కొట్టి పడేస్తున్నారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఇంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇటీవలే నయనతార విఘ్నేష్ శివన్ లు కూడా సరోగసి ద్వారా బిడ్డల్ని కన్న తర్వాత ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తదుపరిచిన RC 15ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ తో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.