పొన్నియిన్‌ సెల్వన్‌2 విడుదలపై క్లారిటీ ఇచ్చిన మణిరత్నం?

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కించిన చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఇక ఈ సినిమా అత్యధిక థియేటర్లో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో డైరెక్టర్ మణిరత్నం చెన్నైలో నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సినిమాని తాను ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.మొదటి భాగం సెప్టెంబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుండగా రెండవ భాగం విడుదల తేదీ పై కూడా డైరెక్టర్ మణిరత్నం ఈ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విడుదలైన 6 నుంచి 8 నెలల తరువాత పొన్నియిన్‌ సెల్వన్‌2 విడుదలవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇలా ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీ లో నటిస్తుండడంతో పెద్ద ఎత్తున ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.ఇకపోతే ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో విడుదల కానుంది.