హీరోయిన్ల కు కూడా దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్న మంచు వారి అమ్మాయి?

టాలీవుడ్ స్టార్ హీరో మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి తెలియని వారంటూ ఉండరు. మంచు లక్ష్మి హైదరాబాద్లో పుట్టినప్పటికీ తన చదువు మొత్తం అమెరికాలో పూర్తిచేసింది. అంతేకాకుండా నటన పట్ల తనకి ఉన్న ఆసక్తి వల్ల అక్కడే పలు హాలీవుడ్ సీరియల్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన లక్ష్మి మంచు అనగనగా ఒక ధీరుడు సినిమాలో విలన్ పాత్రలో నటించింది. అంతేకాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ పర్సన్.

ఈవిడ నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో మంచి సినిమాలను టీవీ షోస్ నిర్మించింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన కొన్ని రియాలిటీ షోలకు నిర్మాతగా, వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రస్తుతం మంచు లక్ష్మి పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వాటిని నిర్మిస్తూ బిజీగా ఉంది. ఇలా నటనతో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తనకి తన కూతురికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమ్ టూర్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, ఫిట్నెస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల మంచు లక్ష్మి గురించి ఒక వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. మంచు లక్ష్మి ఇటీవల ఒక అరుదైన గౌరవం దక్కించుకుంది.TC కండ్లెర్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ప్రకటించే 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ లిస్ట్ లో టాలీవుడ్ లక్ష్మి మంచు చోటు సంపాదించుకున్నారు. ఈ విషయంలో మంచు లక్ష్మి స్టార్ హీరోయిన్ సైతం వెనక్కి నెట్టి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ లిస్టులో మంచు లక్ష్మి తో పాటు రామ్ చరణ్ ,మహీరా ఖాన్, మానుషీ చిల్లర్ కూడా ఉన్నారు. మంచు లక్ష్మి అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడంతో మంచు వారి అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.