అభిమానులతో ‘గుంటూరుకారం’ రుచి… సుదర్శన్‌ థియేటర్‌కు వచ్చిన మహేశ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో వచ్చిన లేటెస్ట్‌ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌ గా నటించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుండి మిక్సుడ్‌ టాక్‌ వచ్చింది.

సినిమాలో మహేష్‌ ఇప్పటివరకు కనిపించినంత మాస్‌ రోల్‌ లో కనిపించి ఆడియన్స్‌ కు ట్రీట్‌ ఇచ్చాడు. దాంతో.. థియేటర్స్‌ వద్ద రచ్చ చేస్తున్నారు మహేష్‌ బాబు ఫ్యాన్స్‌. ముఖ్యంగా మహేష్‌ బాబు ఫేవరెట్‌ థియేటర్‌ సుదర్శన్‌ లో ఆ సెలబ్రేషన్స్‌ నెక్ట్స్‌ లెవల్లో ఉంటాయి.

ఆ హంగామాను చూడడానికి మహేష్‌ బాబు ఫ్యామిలీ పలుమార్లు అక్కడికి వచ్చి అభిమానులతో సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. శుక్రవారంరిలీజైన ‘గుంటూరు కారం’ సినిమా చూసేందుకు మహేష్‌, నమ్రత, ఫ్యామిలీతో కలిసి సుదర్శన్‌ థియేటర్‌ కి వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారాయి.