రాజమౌళితో తదుపరి చిత్రంకోసం మహేశ్‌ రెడీ !

ఇటీవలే ‘గుంటూరు కారం’ సినిమా విజయంతో జోరుమీదున్న సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ తో బిజీ అవబోతున్నాడని ఇప్పటికే వార్తలు ఫిలింనగర్‌ సర్కిల్‌లో రౌండప్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రిన్స్‌ అభిమానులకు మంచి కిక్కిచ్చే అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’కు సంబంధించి డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌.

ఈ ఏడాది ఉగాది నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలు కానుందట. అంతేకాదు ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశానని, ఇందులో పాపులర్‌ హాలీవుడ్‌ యాక్టర్‌ కూడా నటించే అవకాశాలున్నాయని రైటర్‌ విజయేందప్రసాద్‌ హింట్‌ కూడా ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని 2026 ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం.

యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించబోతున్న ఈ మూవీలో హిందీ యాక్టర్లతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్‌ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదే నిజమైతే జక్కన్న నుంచి మరో గ్లోబల్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌ రావడం పక్కా అయిపోయినట్టేనంటున్నారు సినీ జనాలు.

‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్‌లో షూటింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నారని.. ఫిలింనగర్‌ సర్కిల్‌లో వార్తలు రౌండప్‌ చేస్తున్నాయి. ఈ సెట్‌లోనే అగ్రభాగం షూటింగ్‌ జరుగనుండగా.. మిగిలిన భాగాన్ని ఆఫ్రికా, యూరప్‌లో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.