ప్రభాస్ రేంజ్ ని దాటబోతున్న మహేష్.. ఇకపై ‘ సూపర్ స్టార్’ మహేష్ కాదు “సర్కారు” మహేష్ అనాల్సిందే..!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మహేష్ బాబు కి ఉన్న రేంజ్ అండ్ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ప్రభాస్ తో సహా ఇప్పుడు టాలీవుడ్ హీరోలందరు పాన్ ఇండియన్ సినిమాలని ఎంచుకుంటున్నారు. ప్రభాస్ మాదిరిగా పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవడానికి శ్రమిస్తున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ప్రత్యేకించి పాన్ ఇండియన్ సినిమాలో నటించాలని అనుకోలేదు.

Mahesh Babu: Mission Impossible! Says who - tollywood

ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో అద్భుతమైన కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నటించబోతున్నసినిమా ‘సర్కారు వారి పాట‘. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమాగా రూపొందనుండగా గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ..14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక మహేష్ బాబు, ఎస్ ఎస్ థమన్ కాంబినేషన్ 7 ఏళ్ళ తర్వాత రిపీటవుతుండటం కూడా విశేషం.

కాగా ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా ఎంతో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. దర్శకుడు పరశురాం మహేష్ కోసం యూనివర్సల్ కాన్సెప్ట్ ని సిద్దం చేశాడు. అదే ఇప్పుడు సర్కారు వారి పాట పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా తయారవబోతుండటానికి పెద్ద కారణం అయింది.
ఇది నిజంగా మహేష్ ఫ్యాన్స్ తో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులకి సర్‌ప్రైజింగ్ న్యూస్ అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సెకండ్ లీడ్ లో కనిపించనుదని సమాచారం. సర్కార్ వారి పాట చిత్రీకరణ కోసం ఏకంగా చార్టెడ్ విమానాన్ని ఎక్కబోతున్నారట మహేష్ టీం. ఒక షెడ్యూల్ మొత్తం విదేశాలలోనే చిత్రీకరణ జరిపేందుకు ప్లాన్ చాశారట. అయితే రాజమౌళి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ వస్తుందనుకున్న మహేష్ కి సర్కారు వారి పాట తోనే వచ్చేలా పరశురాం భారీ స్థాయిలో సినిమాని రూపొందించడానికి స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ ‘సూపర్ స్టార్’ మహేష్ కాదు ‘సర్కారు’ మహేష్ అని పిలుచుకుంటారని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మొత్తానికి మహేష్ సర్కారు వారి పాట తో ప్రభాస్ రేంజ్ ని దాటబోతున్నట్టు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారట.