కీర్తి సురేష్ విషయంలో టెన్షన్ పడుతున్న మహేష్ ఫ్యాన్స్ .. ఇందులో నిజమెంత ..?

మహానటి సినిమా కి ముందు కీర్తి సురేష్ అకౌంట్ లో నేను శైలజ, నేను లోకల్ లాంటి సినిమాలతో పాటు తమిళ సినిమాలు ఉన్నాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన అజ్ఞాతవాసి సినిమా మాత్రం దారుణంగా ఫ్లాపయింది. ఆ తర్వాత చేసిన మహానటి సినిమాతో కీర్తి క్రేజ్ సౌత్ మొత్తం ఊహించని విధంగా పెరిగిపోయింది. దాంతో వరసగా తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వచ్చాయి.

Keerthy Suresh's Miss India review: Not everyone's cup of tea

వచ్చిన అవకాశాలలో మంచివని భావించి కొన్ని సినిమాలు కమిటయింది. అయితే కీర్తి నటించిన సినిమాలన్ని ఒక్కొక్కటిగా రిలీజై ఫ్లాపవుతూ వస్తున్నాయి. ఆమధ్య ఓటీటీలో రిలీజైన పెంగ్విన్ సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ ఉన్నప్పటికి రిలీజైయ్యాక మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక రీసెంట్ గా రిలీజైన మిస్ ఇండియా సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మిస్ ఇండియా సినిమా కంటే పెంగ్విన్ చాలా బెటర్ అన్న టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ విషయం సూపర్ స్టార్ మహేష్ అభిమానులని కలవర పెడుతుందని అంటున్నారు. మహేష్ బాబు నటించిన గత చిత్రాలు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు .. ఇలా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కాబట్టి హీరోయిన్ కి కూడా తన సినిమాల ట్రాక్ రికార్డ్ బావుంటే సర్కారు వారి పాట భారీ సక్సస్ అవుతుందని భావిస్తున్నారట. కాని కీర్తి నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం తో ఆ ప్రభావం సర్కారు వారి పాట మీద పడుతుందేమో అని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.