మహేష్ బాబుతో సినిమా పక్కా… కీలక అప్డేట్ ఇచ్చిన మెహర్ రమేష్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా పలు సినిమాలను తెరకెక్కించి ఎంతో గుర్తింపు పొందిన మెహర్ రమేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు.గతంలో ఈయన పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది అయితే తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెహర్ రమేష్ తన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా మెహర్ రమేష్ గతంలో పవన్ కళ్యాణ్ తో తప్పనిసరిగా సినిమా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నానని త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేస్తానని ఈయన చేసిన కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి.ఇకపోతే తాజాగా పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెహర్ రమేష్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తున్నానని ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ బాబుతో తన సినిమా ఉంటుంది అంటూ ఈయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ పూర్తి కాగానే తాను మహేష్ బాబుని కలిసి తన సినిమా గురించి వివరిస్తానని అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా తెలియజేస్తాను అంటూ మెహర్ రమేష్ పేర్కొన్నారు.ఈ విధంగా ఈయన మహేష్ బాబుతో తన సినిమా ఉండబోతుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు. ఈ సినిమా అనంతరం మహేష్ బాబు మెహర్ రమేష్ కాంబినేషన్లో సినిమా రావచ్చని అభిమానులు భావిస్తున్నారు.