‘ప్రేమలు’ సినిమా చూసి ఆనందించా: మహేశ్‌ బాబు

తాజాగా విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునావిూ సృష్టిస్తోన్న చిన్న సినిమా ‘ప్రేమలు’ పై సోషల్‌ మీడియా వేదికగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూస్తూ హాయిగా నవ్వుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 9న విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. మంచి కామెడీ, లవ్‌ అనే అంశాలతో ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్‌, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్భుతమని మెచ్చుకున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పాన్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ అందించారు. మార్చి 8న విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు.. విడుదలైనప్పటి నుండి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన ప్రముఖులెందరో ఈ సినిమాను కొనియాడుతున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. సోషల్‌ విూడియా వేదికగా సినిమాను, సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన కార్తికేయను అభినందించారు. తెలుగు ప్రేక్షకులకు ‘ప్రేమలు’ చిత్రాన్ని అందించిన కార్తికేయకు ధన్యవాదాలు. బాగా ఎంజాయ్‌ చేశాను. చివరిగా నేను ఏ సినిమా చూసి ఇలా ఎంజాయ్‌ చేశానో గుర్తు లేదు. ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా బాగా నచ్చింది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటనను కనబరిచారు.

టీమ్‌ మొత్తానికి నా అభినందనలు అని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు లైక్స్‌, కామెంట్స్‌కి అయితే లెక్కే లేదు. ఒక మంచి సినిమాను ప్రమోట్‌ చేయడానికి, ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు చేరవేయడానికి మహేష్‌ బాబు ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారంటూ.. అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.