Mahesh Babu : మహేష్ బాబు బాలకృష్ణ ను ఫాలో అవుతున్నాడా..?

Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్,14రీల్స్,జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ఇప్పటి అభిమానులను అలరించింది. సినిమా నుంచి విడుదలైన కళావతి సాంగ్, పెన్ని సాంగ్ సంగీత ప్రియులను అలరించాయి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి పాట రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ చేస్తున్నారు అన్న వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయితే గుమ్మడికాయ కూడా కొట్టేయొచ్చు అంటున్నారు. అయితే ఈ పాటకు సంబంధించి ఒక రూమర్ బయటకు వచ్చింది. ఈ పాట సీనియర్ హీరో అయినా బాలకృష్ణ ను స్ఫూర్తిగా తీసుకొని పెట్టారు అని సమాచారం.

అఖండ సినిమాలో జై బాలయ్య పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో కూడా ఇలాంటి ఒక పాట ఉండబోతోంది అని వార్తలు వస్తున్నాయ్.ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాలో ఇలాంటి పాట లేదు. ఇంకొక విశేషం ఏంటంటే ఒకవేళ ఈ పాట నిజంగా పెట్టుకుంటే అఖండ సినిమా కి సర్కారు వారి పాట సినిమాకి సంగీత దర్శకుడు తమన్ కావడం విశేషం.ఇప్పటి వరకు ఇలాంటి పాటలను బాలకృష్ణ,చిరంజీవి, అక్కినేను హీరో లు ఫాలో అయ్యారు.