మహేశ్ బాబు ఫాన్స్ కి చాలాకాలం తరవాత ఫుల్ ఖుషీ ఇచ్చిన మ్యాటర్ ఇది

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుతో పాటు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అభిమానులు ప్రస్తుతం సంభ్రమాశ్చర్యంలో మునిగితేలుతున్నారు. ఎందుకంటారా? ఈరోజు బర్త్‌డే జరుపుకుంటున్న పూరికి మహేశ్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ఇందులో వింతేముంది అనుకోకండి. ఎందుకుంటే గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తిందని, అందుకే మాట్లాడుకోవడం లేదని అనేక వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పూరికి మహేశ్‌ బర్త్‌డే విషెస్‌ తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

‘నా ఫేవరేట్ డైరక్టర్స్ లో ఒకరైన పూరీ జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు సక్సెస్ ఫుల్ గా.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ పూరికి మహేశ్‌ విషెస్‌ తెలిపాడు. మహేశ్ ట్వీట్ పట్ల పూరి జగన్నాథ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘మహేశ్ సార్.. మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. లవ్యూ ఆల్వేస్’ అని పూరి సమాధానమిచ్చారు. ఇక పూరికి మహేశ్‌ విషెస్‌ తెలపడం, మహేశ్‌ ట్వీట్‌కు పూరికి రిప్లై ఇవ్వడం చూస్తుంటే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయినట్టే కనిపిస్తున్నాయి.

ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి, బిజినెస్ మెన్ చిత్రాలు ఎంతటి ఘనవిజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రంగా ‘జనగణమన’ వస్తుందని అందరూ భావించారు. అయితే కారణాలేంటో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. అయితే తాను ఫెయిల్యూర్‌లో ఉన్న కారణంగానే అవకాశం ఇవ్వడం లేదని మహేశ్‌ను పూరి​బహిరంగంగా విమర్శించడంతో అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక రాజకీయాల్లో సినిమాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత మిత్రులు ఉండరన్నట్టు ఇపుడు మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ మధ్య ఉన్న ఆ గొడవలు సద్దుమణినట్టు సమాచారం. అంతేకాదు అప్పట్లో మహేష్ బాబు నో చెప్పిన ‘జనగణమన’ సినిమాను కాస్తంత మార్పుల చేసి మహేష్ బాబుతో పూరీ ఆ కథను ఓకే చేయించుకున్నట్టు సమాచారం.