సర్కారు వారి పాట.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో గాని సినిమపై వస్తున్న రూమర్స్ మాత్రం రోజుకోటి వైరల్ అవుతోంది. ఎనౌన్స్ చేసి నెలలు గడిచాయి. ఇంకా షూటింగ్ విషయంలో అఫిషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ మరోసారి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు టాక్ వస్తోంది.

గీతగోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక అనుకున్నట్టు జరిగితే సినిమా విడుదల 2021 సమ్మర్ తరువాత ఉంటుందట. ఆగస్టు 7న మహేష్ సెంటిమెంట్ ప్రకారం ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారట. ఎందుకంటే 2015లో అదే తేదీన శ్రీమంతుడు రిలీజ్ అయ్యింది. ఆ సినిమా మహేష్ మార్కెట్ ను ఒక్కసారిగా 200కోట్లకు తెచ్చింది.

ఇక ఇప్పుడు అదే తరహాలో హిట్ అందుకోవాలని మహేష్ సెంటిమెంట్ డేట్ ను లాక్ చేసుకున్నట్లుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని మహేష్ మాత్రం సర్కారు వారి పాట షూటింగ్ ను వచ్చే ఏడాది సమ్మర్ లోపు పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నట్లు టాక్ వస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కీర్తి సురేష్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.