మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ అవ్వబోతున్న “ఉప్పెన” మూవీలో మూడవ పాట

mahesh babu is going to release 3rd song from uppena movie

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ”ఉప్పెన”. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్ గా నటించింది. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు లిరికల్ వీడియో సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘నీ కళ్ళు నీలి సముద్రం..’ ‘ధక్ ధక్..’ పాటలు ఎక్కడ చూసిన మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ‘ఉప్పెన’ సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

mahesh babu is going to release 3rd song from uppena movie
mahesh babu is going to release 3rd song from uppena movie

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘రంగులద్దుకున్న..’ అనే సాంగ్ లిరికల్ వీడియోని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేస్తారని మేకర్స్ వెల్లడించారు. దీపావళి కానుకగా నవంబర్ 11న సాయంత్రం గం.4. 05 నిమిషాలకు ‘రంగులద్దుకున్న’ పాటను మహేష్ విడుదల చేయనున్నారు. ఈ పాట కూడా శ్రోతలకు నచ్చుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. కాగా పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ అయినప్పటికీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా ‘ఉప్పెన’ చిత్రాన్ని నిర్మించారని తెలుస్తోంది. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ కరోనా కారణంగా కుదరలేదు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.