సర్కారు వారి పాట పోస్టర్ మీద మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారా..?

సర్కారు వారి పాట సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో తెరకెక్కుతున్న 27 వ సినిమాగా రూపొందుతున్న సర్కారు వారి పాట దుబాయ్ లో తాజా షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా షెడ్యూల్ లో కీలకమైన సీన్స్ ని మహేష్ బాబు కీర్తి సురేష్ మీదే తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశురాం. గీత గోవిందం సినిమాతో సంచలన హిట్ అందుకున్న పరశురాం ఇప్పటి వరకు మహేష్ బాబు లాంటి స్టార్ తో పాన్ ఇండియన్ సినిమా చేసే అవకాశం దక్కలేదు.

మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాన్ ఇండియన్ సినిమాగా బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న భారీ స్థాయి కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు పరశురాం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న దుబాయ్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్.. అమెరికా లో జరిపే లాంగ్ షెడ్యూల్స్ తో సర్కారు వారి పాట టాకీపార్ట్ తో పాటు సాంగ్స్ ని కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ బ్యాంక్ సెట్ తో పాటు మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు.

అయితే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని రిలీజ్ చేసినప్పుడు మహేష్ ని పూర్తి లుక్ ని రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత మహేష్ బర్త్ డే సందర్భంగా మరొక పోస్టర్ ని రిలీజ్ చేసినా అందులో కూడా మహేష్ బాబు ని రివీల్ చేయలేదు. ఇక తాజాగా సర్కారు వారి పాట సినిమా రిలీజ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా సర్కారు వారి పాట రిలీజ్ చేస్తునట్టు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి అధికారకంగా ప్రకటించారు. అయితే ఈ పోస్టర్ లో కూడా మహేష్ బాబు లుక్ ని రివీల్ చేయలేదు. దీనిమీద మహేష్ అభిమానులే కాదు ప్రేక్షకులు మండిపడుతున్నారట. ఇప్పటివరకు మూడు పోస్టర్స్ వచ్చిన మహేష్ లుక్ ని సస్పెన్స్ గా ఉండటం మహేష్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేపోతున్నారట.