మహేష్ బాబు ఫ్యాన్స్ కష్టాలు మామూలువి కాదు పాపం ..!

మహేష్ బాబు కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. గీతగోవిందం తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తర్వాత డైరెక్టర్ పరశురామ్ కి మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా రూపొందించే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమాని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫస్ట్ టైం మహేష్ సరసన యువనటి కీర్తిసురేష్ రొమాన్స్ చేయనుంది. కాగా గత నెల ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో ప్రారంభమయి శరవేగంగా సాగుతోంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో మేజర్ పార్ట్ చిత్రికరించినట్లు తెలుస్తుంది.

కాగా ఈ నెల 21న సర్కారు వారి సినిమాకి సంబంధించిన దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ కాబోతోందని సమాచారం. ఈ సందర్బంగా మహేష్ టీమ్ ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ నెలరోజుల పాటు షూటింగ్ జరుపుకున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారట. అయితే దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ అవగానే సర్కారు టీమ్ అంతా ఇండియాకు వచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ముందు ..ఇప్పటివరకు దుబాయ్ షెడ్యూల్లో షూట్ చేసిన కొన్ని స్టిల్స్ తో ఓ స్పెషల్ వీడియో తయారుచేసి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే మహేష్ బాబు అభిమానుల తో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మళ్లీ ఈ సర్ప్రైజ్ అంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులుండవు. అయినా మహేష్ ఫ్యాన్స్ కు ఈ ఏడాది ఒకే నిరాశ. ఎందుకంటే.. ఈ ఏడాది సర్కారు వారి పాట రిలీజ్ కాకపోవడమే. మహేష్ నుండి గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. ఈ ఏడాది కరోనా వల్ల ఈ ఏడాది ఏ సినిమా రాలేదు. సర్కారు వారి పాట కూడా వచ్చే ఏడాదికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే సరిలేరు కి సర్కారు వారి పాట కి రెండేళ్ళు గ్యాప్ వచ్చింది. దాంతో ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారట.