Mahesh Babu: ఆచార్య సినిమా కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తోటి హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే గతంలో జల్సా, బాద్షా వంటి చిత్రాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఈ క్రమంలోనే తాజాగా మెగా స్టార్ నటించిన ఆచార్య సినిమాకి కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మెగా కుటుంబానికి మహేష్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది.ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చి చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు వంతు వచ్చింది.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య. నిజానికి ఈ సినిమాలో చిరంజీవితో పాటు మహేష్ బాబు నటించాల్సి ఉంది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి మహేష్ బాబు తప్పుకోవడంతో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగాస్టార్ ఆచార్య సినిమా కోసం మహేష్ బాబు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. మహేష్ బాబుకు కేవలం మెగాస్టార్ పై అభిమానం మాత్రమే కాకుండా కొరటాల శివ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది.కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ అందుకున్నారు. ఈ క్రమంలోనే కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక కోసం రాజమౌళి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి.